Header Banner

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం! తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి..

  Sat Jun 07, 2025 18:06        Politics

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, విశాఖపట్నం మాజీ శాసనసభ్యుడు పల్లా సింహాచలం కన్నుమూశారు. దీనిపై రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింహాచలం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పల్లా సింహాచలం గారితో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని, ఆయన అందించిన సేవలను మంత్రి లోకేశ్ గుర్తుచేసుకున్నారు. "1989 నుంచి తెలుగుదేశం పార్టీకి పల్లా సింహాచలం గారు అమూల్యమైన సేవలందించారు. పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయన పాత్ర ఎంతో కీలకమైనది" అని లోకేశ్ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ! 500 ఏఐ స్టార్టప్లు ప్రారంభం..

 

1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నం-2 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి, ఆ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషిచేశారని ఆయన కొనియాడారు. పల్లా సింహాచలం గారు సౌమ్యుడిగా, నిరాడంబరంగా ప్రజలతో మమేకమయ్యేవారని లోకేశ్ తెలిపారు. "శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ప్రజలకు అన్ని విధాలా అండగా నిలిచారు. వారి సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతగానో పాటుపడ్డారు" అని మంత్రి వివరించారు. ఆయన మరణం పార్టీకి, విశాఖ ప్రజలకు తీరని లోటని అన్నారు. "పల్లా సింహాచలం గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో పల్లా శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని నారా లోకేశ్ తన సంతాప సందేశంలో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Palla Srinivasarao #Palla Simhachalam #Nara Lokesh #TDP Telugu #Desam Party #Visakhapatnam #Andhra Pradesh #Politics MLA #Ex MLA #Political News